యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని ఆదివారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవిదేవి దర్శించుకొన్నారు.
ఉదయం యాదాద్రికి చేరుకొన్న ఆమె మొదటగా స్వయంభూ పంచనారసింహుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం ఇవ్వగా, ఆలయ ఇంచార్జి ఈవో రామకృష్ణారావు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.