హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): ఓ వీడియోలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్నేనని మంగళ్హాట్ పోలీసులు నిర్ధారించారు. అసెంబ్లీలో రాజాసింగ్ వాయిస్ను, వీడియోలోని వాయిస్ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించగా, ఒక్కటేనని తేలింది.
ఆగస్టులో పది నిమిషాల వీడియోను రాజాసింగ్ పోస్టు చేశారు. ఇది ఒక వర్గాన్ని కించపరిచే విధంగా ఉన్నదంటూ పోలీసులకు ఫిర్యాదులు అందడంతో కేసులు నమోదు చేశారు. మంగళ్హాట్ పోలీసులు ఆ వీడియోను సేకరించి అందులో ఉన్న వాయిస్ రాజాసింగ్దేనా? కాదా? అనేది శాస్త్రీయంగా నిర్ధారించేందుకు ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. దీనితో పాటు అసెంబ్లీలో రాజాసింగ్ మాట్లాడిన క్లిప్పింగ్లను కూడా సేకరించారు. ఫోరెన్సిక్ పరీక్షల్లో ఈ రెండు వాయిస్లు ఒకటేనని తేలింది. దీంతో మంగళ్హాట్ పోలీసులు రాజాసింగ్పై చార్జిషీట్ వేసేందుకు సిద్ధమవుతున్నారు.