సుబేదారి, డిసెంబర్ 16: ఉద్యోగ కోచింగ్ సమయంలో స్నేహం పేరుతో యువతిని పరిచయం చేసుకున్న యువకుడు తన వక్రబుద్ధిని చాటుకున్నాడు. అప్పులున్నాయని రూ.7 లక్ష లు తీసుకొని తిరిగి ఇవ్వకపోవడమే కాకుండా.. తనను పెళ్లి చేసుకోవాలని బ్లాక్మెయిల్ చేస్తూ యువతిని వేధిస్తున్నాడు. వేధింపులు భరించలేక బాధితురాలు పోలీసు ఉన్నత అధికారికి ఫిర్యాదు చేసింది. వరంగల్ జిల్లా గీసుగొండ మండలానికి చెందిన ఓ యువతి 2018లో హైదరాబాద్లో గ్రూప్ కోచింగ్ తీసుకున్నది. ఆ సమయంలో మహబూబాబాద్ జిల్లా గూడూ రు మండలానికి చెందిన చంద్రశేఖర్ పరిచ యం అయ్యాడు. ఆ యువతికి గ్రూప్-4 ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పనిచేస్తున్నది.
ఈ క్రమంలో తనకు అప్పులున్నాయి.. ఉద్యోగం వచ్చిన తర్వాత తిరిగి ఇస్తానని నమ్మించి.. 2022లో యువతి ఫోన్ యాప్ ద్వారా చంద్రశేఖర్ రూ.7 లక్షలు తీసుకున్నాడు. అంతేకాదు.. ఆమె మెడలోని బంగారు ఆభరాణాలు కూడా తీసుకున్నాడు. కొద్దిరోజుల తర్వాత ప్రేమిస్తున్నా.. తనను పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానని.. అతడి దగ్గరి బంధువు ఆర్ఎస్సైని కమిషనరేట్కు పంపి బెదిరించాడు. ఈ మేరకు తన కు న్యాయం చేయాలని బాధితురాలు సీపీకి ఫిర్యాదు చేసింది. సీపీ ఆదేశాల మేరకు గీసుగొండ పోలీసుస్టేషన్లో ఈ నెల 13న వేధింపులకు గురిచేసిన చంద్రశేఖర్పై కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. అయితే.. చంద్రశేఖర్తోపాటు ఆర్ఎస్సై శ్రీనివాస్పై కూడా బాధితురాలు ఫిర్యాదు చేసినా గీసుగొండ పోలీసులు కేసు నమోదు చేయకపోవడం విమర్శలకు తావిస్తున్నది.