హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ కార్మిక సంఘాల్లో సుదీర్ఘకాలం పనిచేసిన కే రాజిరెడ్డి ఎస్డబ్ల్యూఎఫ్ (ఐఎన్టీయూసీ) నుంచి స్వచ్ఛందంగా వైదొలిగారు. తన పుట్టినరోజు సందర్భంగా శనివారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కుటుంబ సభ్యులకు సమయం కేటాయించే క్ర మంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. అయితే, ఆయన ఇటీవల కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కార్మికులకు అనుకూలంగా పోరాట కార్యాచరణ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టిన అంశాల ను విస్మరించిందని ఆయన పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. కార్మికుల్లో పెరుగుతున్న అసంతృప్తిని పార్టీ పెద్దలకు, మంత్రికి, సీఎంకు సైతం విన్నవించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. అయినా లాభం లేకపోవడంతో ఈనెల 24 నుంచి 26 వరకూ సామూహిక నిరాహారదీక్షలకు సన్నద్ధమయ్యారు. ఈ క్రమం లో ఆయనను సంప్రదించకుండానే ఐఎన్టీయూసీ నేతలు సమావేశమై.. కొత్త కమిటీని ప్రకటించి రాజిరెడ్డిని తీసేశారు. ఈ క్రమంలో ఆయనను తీసివేయడంతో.. ఈనెల 11న ఐఎన్టీయూసీకి రాజీనామా ప్రకటించారు. అయినా వేధింపులు ఎక్కువ కావడంతో శనివారం అన్ని యూనియన్ కార్యక