హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని ప్రతి పల్లె ముఖ్రా(కే) కావాలని, ఈ గ్రామా న్ని ఆదర్శంగా చేసుకొని రాష్ట్రంలోని పల్లెలు స్వయం స మృద్ధి బాటలో పయనించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. సోమవారం బీఆర్ఎస్లో చేరికల అనంతరం ముఖ్రా(కే) సర్పంచ్ గాడ్గె మీనాక్షి, గ్రామస్థులు సీఎంఆర్ఎఫ్కు రూ.లక్ష చెకు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, పల్లెలు ప్రగతిపథంలో సాగుతున్నాయని అన్నారు. ఇందుకు ఆదిలాబాద్ జిల్లాలోని ముఖ్రా(కే) గ్రామమే ఉదాహరణగా నిలిచిందని చెప్పారు. గ్రామంలో సేకరించిన తడిచెత్త ద్వారా వర్మీకంపొస్ట్ తయారు చేసి రూ.7 లక్షల ఆదాయం సంపాదించడం అద్భుతమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎంపీ సంతోష్కుమార్, ఎంపీటీసీ గాడ్గె సుభాష్ తదితరులు పాల్గొన్నారు.