సిరిసిల్ల టౌన్, మే 27: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు నల్ల శ్రావణ్ మరమగ్గంపై అద్భుతాన్ని సృష్టించాడు. చింతాకులో దూరే చీరను రూపొందించి ఔరా అనిపించాడు. 46 ఇంచుల వెడల్పు, ఐదున్నర మీటర్ల పొడవు ఉన్న ఈ చీర 150 గ్రాముల బరువు ఉంటుందని శ్రావణ్ తెలిపాడు. ఐదు రోజులు శ్రమించి ఈ చీరను తయారు చేశానని పేర్కొన్నాడు.
గతంలో దబ్బణం, అగ్గిపెట్టెలో ఇమిడే చీరలను తయారు చేశామని, ఇప్పుడు అంతకన్నా సూక్ష్మమైన చింతాకులో దూరే చీరను తయారు చేయడం సంతోషంగా ఉందని చెప్పాడు.