హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): వేసవి సెలవుల అనంతరం దేశవ్యాప్తంగా స్కూళ్లు ప్రారంభమవుతున్నాయి. దీంతో స్కూల్ ఫీజులు చెల్లింపులు, పుస్తకాలు, యూనిఫామ్స్ కొనుగోళ్ల హడావుడి మొదలైంది. ఈ నేపథ్యంలో పిల్లల చదువుకు ఏటా ఎంత ఖర్చు అవుతుందనే విషయంపై స్కూల్నెట్ ఇండియా సంస్థ ఇటీవల సర్వే చేసింది. దేశవ్యాప్తంగా 91 నగరాల్లో రెండు వేల మంది తల్లిదండ్రుల నుంచి నవంబర్ 2021- ఫిబ్రవరి 2022 మధ్య అభిప్రాయాలు సేకరించింది. మూడో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పిల్లలున్న కుటుంబాలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. ఈ సర్వేలో పలు ఆసక్తికర వివరాలు తెలిశాయి.
సర్వేలో ముఖ్యాంశాలు..