హైదరాబాద్, మే30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ నుంచి దాదాపు 3,016 మంది హజ్ యాత్రకు వెళ్లనున్నట్టు హోంమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. హజ్యాత్ర ఏర్పాట్లపై హాజ్కమిటీ, మైనార్టీ శాఖ అధికారులతో మంత్రి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. శంషాబాద్ విమానాశ్రయంలో హజ్ యాత్రికులకు ఏర్పాట్లు, సౌకర్యాలపై చర్చించారు. జూన్ 20 నుండి 30వరకు రాష్ట్రంలో హజ్ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. సమావేశంలో హజ్కమిటీ చైర్మన్ మహమ్మద్ సలీం, వక్ఫ్ బోర్డు చైర్మన్ మసీవుల్లా ఖాన్, మైనార్టీ సంక్షేమ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నదీమ్, హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షఫీవుల్లా, ఐపీఎస్ అరుణ్ బెహల్, జీఎంఆర్ సీవోవో బీబీయానా తదితరులు పాల్గొన్నారు.