హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): శాసనమండలి సభ్యుల గౌరవాన్ని, హక్కులను కాపాడే బృహత్తర బాధ్యత అర్జీల సమితి, ప్రివిలేజ్ కమిటీ సభ్యులపై ఉన్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన శాసనమండలి కమిటీహాల్లో నిర్వహించిన అర్జీల సమితి, విశేష అధికారాల కమిటీల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వ దృష్టికి రాని ప్రజా సమస్యలపై ఎమ్మెల్సీలు సమర్పించే అర్జీలను శాసనమండలి ఈ కమిటీలకు అందజేస్తుందని చెప్పారు.
ఆయా అర్జీలపై అధికారులతో చర్చించి ప్రజలకు న్యాయం చేకూర్చడంలో ఈ కమిటీలకు ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. సభ్యుడు తన హకులకు భంగం వాటిల్లిందని భావించిన సందర్భంలో కమిటీ ముందుకొచ్చి పరిషరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్రెడ్డి, ఫారూఖ్హుస్సేన్, సిరికొండ మధుసూదనాచారి, శేరి సుభాష్రెడ్డి, యాదవరెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు.