Assembly Session | హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): క్వశ్చన్ అవర్లో సంబంధిత శాఖ అధికారులు అందుబాటులో లేకపోవడంపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.
సోమవారం శాసనమండలిలో సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ.. ప్రశ్నోత్తరాల సమయంలో అధికారులు తమకు కేటాయించిన బాక్స్ల్లో అందుబాటులో ఉండేలా మంత్రులు చూసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో పొరపాటు జరుగకూడదని మంత్రులకు చురకలు అంటించారు. ప్రశ్నోత్తరాలు ప్రారంభమైన చాలాసేపటి వరకు మండలిలో కేటాయించిన బాక్స్ల్లో అధికారులు లేకపోవడంతో చైర్మన్ ఆదేశించారు.