మన్సూరాబాద్, ఏప్రిల్ 29 : రాష్ట్ర ప్రభుత్వం వ్యాపార రంగానికి పెద్దపీట వేస్తూ యువతరానికి ప్రోత్సాహం అందిస్తున్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తెలిపారు. శుక్రవారం మన్సూరాబాద్లోని కేబీఆర్ కన్వెన్షన్ హాల్లో మూడు రోజులు జరగనున్న రెడ్డి వ్యాపారస్తుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డితో కలిసి వివిధ స్టాళ్లను పరిశీలించారు. గుత్తా మాట్లాడుతూ రెడ్డి జాతి ఎంతో గర్వించదగినదన్నారు. తాము బతకడమే కాకుండా ఇతరులకు జీవనోపాధి కల్పించే శక్తి, సామర్థ్యాలు రెడ్డి జాతికి ఉన్నాయని కొనియాడారు.
కష్టపడితే ఏదైనా సాధించవచ్చని.. తామంతా కింది స్థాయి నుంచి కష్టపడుతూ రాజకీయరంగంలో ఒక్కో మెట్టు ఎదుగుతూ పైకి వచ్చామని చెప్పారు. ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి మాట్లాడుతూ ఆత్మీయ సమ్మేళన వేదికను ఉపయోగించుకుని రెడ్డి వ్యాపారస్తులు అభివృద్ధిపథంలో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి, రెడ్డి ఆత్మీయ వేదిక వ్యవస్థాపకుడు కొలను వెంకటేశ్వర రెడ్డి, ఆర్గనైజర్లు సంజీవరెడ్డి, అభిమన్యరెడ్డి, నాయకులు జక్కిడి రఘువీర్రెడ్డి, పోచబోయిన జగదీశ్ యాదవ్ పాల్గొన్నారు.