హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్పూర్లో సోమ, మంగళవారాల్లో కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఇండియన్ రీజియన్ 9వ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఈ కాన్ఫరెన్స్కు రాష్ట్రం నుంచి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు పాల్గొని ప్రసంగించనున్నారు. డిజిటల్ టెక్నాలజీ ద్వారా సుపరిపాలన, దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థల బలోపేతంలో ప్రజాప్రతినిధుల పాత్ర అన్న అంశాలపై రెండురోజుల పాటు సదస్సు జరుగుతుంది.