హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తెలంగాణ గురుకులాలను తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. కొత్త స్టడీ సరిళ్లను ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో బుధవారం ఆమె హైదరాబాద్లోని సంక్షేమభవన్లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో మరిన్ని స్టడీ సరిళ్ల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆమె ఆదేశించారు. ప్రతి స్టడీ సరిల్లో ఫ్యాకల్టీ, కంప్యూటర్లు, అత్యాధునిక సాంకేతిక మౌలిక వసతులను సమకూర్చాలని సూచించారు.
గురుకుల విద్యార్థులకు సౌకర్యాలు, భోజనం మరింత మెరుగుపరచాలని, విజిలెన్స్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు, దుప్పట్లు, గ్లాసులు, ట్రంకు పెట్టెలతో పాటు ఇతర అన్ని సౌకర్యాలను కల్పించాలని చెప్పారు. గురుకుల పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాజేంద్రనగర్లో ఉన్న జేఈఈ, ఎంసెట్ కోచింగ్ సెంటర్ తరహాలో ఖమ్మం, పరిగి, హయత్నగర్, వరంగల్లో కోచింగ్ సెంటర్లను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో 143 కాంట్రాక్ట్ సూపర్వైజర్ల క్రమబద్ధీకరణ
హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): స్త్రీ, శిశు సంక్షేమశాఖలో రెండు దశాబ్దాలుగా కాంట్రాక్ట్ సూపర్వైజర్లుగా (గ్రేడ్-3) పనిచేస్తున్న 143 మందిని క్రమబద్దీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన వారి జాబితాను సిద్ధం చేయాలని ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్యా దేవరాజన్ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు బుధవారం ఆదేశించారు.
ప్రభుత్వ నిర్ణయం వెలువడగానే స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు జీ పున్నారెడ్డి, పద్మ, నాయకులు రమణకుమార్, మీరాబాయి, నారాయణమ్మ తదితరులు హైదరాబాద్లోని మంత్రి సత్యవతి రాథోడ్ నివాసానికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న తమ జీవితాల్లో సీఎం కేసీఆర్ కొత్త వెలుగులు ప్రసాదించారని సంతోషం వ్యక్తంచేశారు. వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయడంతోపాటు 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 143 పోస్టులను రెగ్యులర్ చేయాలని నిర్ణయించారు.