హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ లాసెట్లో రాష్ట్ర గురుకుల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ప్రవేశపరీక్షలో రాష్ట్రవ్యాప్తంగా 3,846 మంది అర్హత సాధించగా.. అందులో రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని 40 మంది విద్యార్థులు ఓపెన్క్యాటగిరీలోనే ర్యాంకులు సాధించటం విశేషం. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లోని 23 మంది రాష్ట్రస్థాయి ఓపెన్ క్యాటగిరీలో 4 వేలలోపుర్యాంకులు సాధించారు. పీ సోని రాష్ట్రస్థాయిలో 485 ర్యాంకుతో సత్తాచాటింది. ఇక గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలో 17 మందిపీవీటీజీఎస్ (పర్టిక్యులర్లీ వల్నరేబుల్ ట్రైబల్ గ్రూప్స్ (కొండరెడ్డి, థోటి, కొలాం, చెంచు తెగలు)) విద్యార్థులు లాసెట్లో సత్తాచాటారు. వీరిలో ఆత్రం రమేశ్రాష్ట్రస్థాయిలో 1,851 ర్యాంకు సాధించాడు. ప్రతిభచాటిన విద్యార్థులను మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, రాష్ట్ర గురుకుల విద్యాలయాలసంస్థ కార్యదర్శి రోనాల్డ్ రోస్ అభినందించారు.