సూర్యాపేట, జూన్ 15 (నమస్తే తెలంగాణ): ‘ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ పార్టీలు, ప్రభుత్వాలు కాదు.. ప్రత్యామ్నా య ఎజెండాలు. అందుకోసం యావత్దేశం ఎదు రు చూస్తున్నది’ అని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేటలో ఏర్పాటుచేసిన దివంగత కర్నల్ సంతోష్బాబు విగ్రహాన్ని బుధవారం మంత్రి ఆవిష్కరించారు. అనంతరం ఆయ న మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు దేశ అవసరాల కోసం ఏ రాజకీయ పార్టీ సరైన పునాదులు నిర్మించలేకపోయిందన్నారు.
స్వాతంత్య్ర పోరాటంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఆ తరువాత ప్రత్యామ్నాయమంటూ ఏర్పడ్డ రాజకీయ పార్టీల సమూహాలు, అనంతర కాలంలో గుజరాత్ను చూపించి దేశాన్ని ఉద్ధరిస్తామంటూ గెలిచిన బీజేపీ పాలనలో వైఫల్యం చెందాయని విమర్శించారు. ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించి లబ్ధి పొందాలన్నది బీజేపీ అభిమతమని మండిపడ్డారు. ప్రతిపక్ష పాత్రను కూడా నిర్వహించలేని హీన స్థితికి కాంగ్రెస్ చేరుకున్నదని ఎద్దేవాచేశారు.