హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి గెస్ట్ ఫ్యాకల్టీల నియామకాలకు ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేసింది. గెస్ట్ ఫ్యాకల్టీల రిక్రూట్మెంట్కు సంబంధించిన ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. గెస్ట్ ఫ్యాకల్టీల నియామకం త్రి సభ్య కమిటీ ఆధ్వర్యంలో జరగనుంది.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పీజీలో కనీసం 50 శాతం మార్కులు, మిగతా అభ్యర్థులు 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. నెట్, సెట్తో పాటు పీహెచ్డీ పూర్తి చేసిన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత కల్పించనున్నారు. టీచింగ్ ఎక్స్పీరియన్స్కు వెయిటేజీ ఇవ్వనున్నారు. నెలకు 72 గంటల పాటు పని వేళలు ఉండనున్నాయి. గెస్ట్ ఫ్యాకల్టీ తప్పకుండా టీచింగ్ డైరీని మెయింటెన్ చేయాలి. పని వేళలను బట్టి జీతాలను చెల్లించనున్నారు. గెస్ట్ ఫ్యాకల్టీ పనితీరు సరిగా లేని యెడల తక్షణమే ఆ విధుల నుంచి తొలగించనున్నారు. బయోమెట్రిక్ అటెండెన్స్ను తప్పనిసరిగా ఉంటుంది.