హైదరాబాద్ : నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో బాండ్ రాసిచ్చిన బీజేపీ నేడు అదే హామీతో కర్నాటక ఎన్నికల్లో రైతులను మోసం చేస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Minister Vemula)ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కుకునూర్ గ్రామానికి చెందిన బీజేపీ,బీఎస్పీ పార్టీకి చెందిన పలువురు యువకులు హైదరాబాద్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఆయన మాట్లాడుతూ పసుపు బోర్డు(Haldi Board) తెలంగాణ రాష్ట్రంలో సాధ్యం కానిది,కర్ణాటక(Karnataka)లో ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు. బీజేపీ వల్ల దేశంలో వైషమ్యాలు తప్పా అభివృద్ధి లేదని అన్నారు. సీఎం కేసీఆర్(CM KCR) అభివృద్ధి కోసం పని చేస్తుంటే బీజేపీ విద్వేష, కక్ష పూరిత రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ దార్శనికత వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో నెంబర్ వన్ గా ఎదిగిందని గుర్తు చేశారు.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ (Minister KTR)వల్ల రాష్ట్రానికి వేలాది పరిశ్రమలు వచ్చాయని, సుమారు 16 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించారని తెలిపారు. కేటీఆర్ చొరవ వల్ల ఐ.టీ ఎగుమతులు పెరిగాయని, నూతన ఆవిష్కరణలకు తెలంగాణ వేదికైందని తెలిపారు. బీజేపీలో విలువలు దిగజారిపోయాయని విమర్శించారు.
ప్రభుత్వరంగ సంస్థలు అమ్ముతూ,అన్ని రకాల ధరలు పెంచుతూ సామాన్యులను అరిగోస పెడుతున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ(Narendra Modi) అసమర్థ ప్రధాని అని దుయ్యబట్టారు.రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాలు, ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరు, బీజేపీ అలంభిస్తున్న విధానాలపై గ్రామాల్లో ముఖ్యంగా యువతలో చర్చ జరగాలన్నారు. బీజేపీ తీరుకు నిరసనగా ఆ పార్టీకి చెందిన యువకులు రాజీనామాలు చేసి బీఆర్ఎస్లో చేరడం యువతలో వచ్చిన మార్పునకు నాంది అని అన్నారు.
బీఆర్ఎస్లో చేరిన వారు..
బీజేపీ,బీఎస్పీ పార్టీల నుంచి భారత రాష్ట్ర సమితిలో చేరిన వారిలో…ఎద్దండి రంజిత్, ర్యాడ ప్రణయ్, బక్కయ్యగారి వినేశ్, బాసర భరత్, ఒరగంటి వినయ్, మోర్తాడ్ గణేష్ ,మర్రి వినోద్, పుప్పాల సత్యనారాయణ,గోల్కొండ శరత్, దాసరి నితిష్, బి.శ్రీనివాస్ గౌడ్, పందేన శంకర్, మర్రి చిన్నారెడ్డి, సిరుప అజయ్, దాసరి సాయికిరణ్, బోజపల్లి శ్రీకర్, బండి ఉదయ్, బాలిశెట్టి సాగర్, బక్కయ్యగారి నితిన్, గోల్కొండ మల్లేష్, జి.అక్షయ్,ర్యాడా రాకేష్,కె.విజ్ఞేష్,పి.సుశాంత్ తదితరులున్నారు.
ఈ కార్యక్రమంలో మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, డాక్టర్ మధుశేఖర్, వైస్ ఎంపీపీ సురేష్ ,సర్పంచ్ లింబాద్రి,రాజశేఖర్ గౌడ్, మాజీ సర్పంచ్ అశోక్, ఎస్సీ మండల ప్రెసిడెంట్ తలారి ప్రభాకర్, మోర్తాడ్ నర్సయ్య, యువ నాయకులు నిమిష్ తదితరులు పాల్గొన్నారు.