హైదరాబాద్, అక్టోబర్16 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం (జీటీఏ) హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాసం ప్రభాకర్ పేరును ఖరారు చేసింది. ఆదివారం హైదరాబాద్ మల్కాజిగిరిలోని మౌలాలి న్యూ రైల్వే కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన సంఘం రాష్ట్ర శాఖ సమావేశం ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానించింది. సంఘం పటిష్టత దృష్ట్యా అన్ని జిల్లాల కోరిక మేరకు కాసం ప్రభాకర్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించినట్టు తెలిపింది. సమావేశంలో జీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి బ్రహ్మచారి, అసోసియేట్ అధ్యక్షుడు దశరథ్, అన్ని జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.