దంతాలపల్లి, ఫిబ్రవరి 17: గ్రూపు-4 పరీక్షల్లో అర్హత సాధించలేదనే మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మం డలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన గదరబోయిన బక్కయ్య-భిక్షమమ్మ దంపతుల కూతురు శిరీష (24) హైదరాబాద్ జవహర్నగర్లో గల ఓ హాస్టల్లో ఉంటూ గ్రూపు-4 పరీక్ష రాసింది. తక్కువ మార్కులు రావడంతో శుక్రవారం రాత్రి హాస్టల్లో ఫ్యాన్కు ఉరేసుకొన్నదని కుటుంబ సభ్యులు తెలిపారు.