హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ ): 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకోసం టీఎస్పీఎస్సీ పదిరోజుల్లో నోటిఫికేషన్ జారీచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. ప్రాథమిక సమాచారం మేరకు మొత్తం పోస్టుల్లో 19 శాఖలకు చెందినవి ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఇండెంట్ కోసం టీఎస్పీఎస్సీ అధికారులు 19 శాఖల ఉన్నతాధికారులతో మరోసారి శనివారం సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఆయాశాఖల అధికారులకు నిర్దేశిత ప్రొఫార్మాను అందజేశారు. అన్ని వివరాలూ సకాలంలో అందితే ఏప్రిల్లో గ్రూప్ -1 నోటిఫికేషన్ జారీఅయ్యే అవకాశాలున్నట్టుగా తెలుస్తున్నది.