న్యూఢిల్లీ: గ్రూప్-1 పరీక్షలను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు (Group-1 Aspirants) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ పిటిషన్ను అత్యవసరంగా విచారించాలంటూ చీఫ్ జస్టిస్ కోర్టులో స్పెషల్ మోషన్ దాఖలు చేశారు. అభ్యర్థుల తరఫున అడ్వకేట్ మోహిత్రావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పరీక్షల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ను ఫాలో కాలేదన అందులో పేర్కొన్నారు. అయితే కేసు సోమవారం విచారణ జరుపుతామని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ వెల్లడించారు. మొదటి కేసుగా ఉదయం 10.30 గంటలకు విచారించనున్నారు. కాగా, అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు గ్రూప్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
మరోవైపు గ్రూప్-1 పరీక్షలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు డివిజన్ విచారణకు స్వీకరించింది. అభ్యర్థుల అప్పీళ్లను ద్విసభ్య ధర్మాసనం మరో బెంచ్కు పాస్ఓవర్ చేసింది. తప్పుడు సమాధానాలతో కూడిన తుది కీ ఆధారంగా నిర్వహించే గ్రూప్-1మెయిన్స్ పరీక్ష ప్రభావం ఎంపికపై ఉంటుందంటూ పలువురు గ్రూప్-1 అభ్యర్థులు హైకోర్టులో అప్పీళ్లను దాఖలు చేశారు. సింగిల్ జడ్జి ఈ నెల 15న ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని అందులో కోరారు. గ్రూప్-1 ప్రిలిమినరీ కీలో తప్పులున్నాయని పలు ఆధారాలను సమర్పించినప్పటికీ సింగిల్ జడ్జి పట్టించుకోలేదని తెలిపారు.
ఈ అప్పీళ్లపై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అభినంద్కుమార్ షావిలి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టే అవకాశం ఉన్నది. ‘కేసులోని పూర్వాపరాలను, వాస్తవాలను సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదు. టీజీపీఎస్సీ ప్రకటించిన తుది కీలో తప్పులున్నాయని ఆధారాలు చూపినా వాటి జోలికి వెళ్లలేదు. దీనిపై మా వాదనలను పరిగణనలోకి తీసుకోలేదు. ప్రశ్నల్లో ఏ రకంగా తప్పులున్నాయో చెప్పినా పరిశీలించలేదు. ప్రశ్నకు ఐచ్ఛిక సమాధానాల్లో సరైనది లేనపుడు ఆ ప్రశ్నను తప్పుగా పరిగణించాలి. కానీ ఆ విధంగా జరుగలేదు.
మెలికలతో కూడిన ప్రశ్నలు ఉండాలంటూ సర్వీస్ కమిషన్ చేసిన వాదనను సింగిల్ జడ్జి ఆమోదించడం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలి. 41, 119వ ప్రశ్నలను పరిశీలిస్తే.. తమకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చేవి. ఈ రెండు ప్రశ్నలను తొలగించడం వల్ల మెరిట్ జాబితాపై ప్రభావం పడుతుంది. ఇలాంటి కీ ద్వారా మెయిన్స్కు అభ్యర్థుల జాబితా రూపొందించడం చట్ట వ్యతిరేకం. ప్రాథమిక పరీక్ష ఒకటే ఎంపికకు ప్రామాణికం కాబోదు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమేనని సింగిల్ జడ్జి పేరొనడం చెల్లదు. సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయాల్సిందే’ అని పిటిషనర్లు తమ అప్పీళ్లల్లో కోరారు.