హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా జీహెచ్ఎంసీ పార్క్లో బిగ్ బాస్-5 విన్నర్ వి.జె సన్నీ మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా సన్నీ మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ లాంటి కార్యక్రమం అద్భతమని కొనియాడారు.
బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చి మొదటిసారి గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగస్వామ్యం అయి మొక్కలు నాటే అవకాశం కలిగినందుకు ఎంపీ సంతొష్ కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం మరో ముగ్గురు సిరి, షణ్ముక్, శ్రీరామ్కు గ్రీన్ ఇండియా చాలెంజ్ సవాల్ విసిరారు.