కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండుగైన సమ్మక్క సారలమ్మ జాతరను రేకుర్తిలో నిర్వహించుకనేందుకు ఏర్పాట్లను ఘనంగా చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. గురువారం రేకుర్తిలోని సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద మేయర్ వై. సునీల్ రావుతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..గిరిజన ఆరాధ్య దేవతలైన సమ్మక్క, సారలమ్మ దేవతల జాతరను మేడారంతో పాటు అన్ని జిల్లాల్లో ఘనంగా జరుపుకుంటారని అన్నారు. వచ్చేనెల 16వ తేదీ నుంచి రేకుర్తిలో నాలుగు రోజుల పాటు జరిగే జాతరకు అన్ని ఏర్పాట్లను చేస్తామని మంత్రి తెలిపారు.
భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు వీలుగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మున్సిపల్ గ్రాంటు నిధులు రూ. 1.30 కోట్లతో టెండర్లు పిలిచి పూర్తి చేశామని పేర్కొన్నారు. సమ్మక్క, సారలమ్మ గద్దె ల చుట్టూ సిసి రోడ్లు, లైటింగ్, బార్ కేడింగ్, మట్టి రోడ్డు పనులు, పార్కింగ్ స్థలాలు, సౌండ్ సిస్టం, క్యూ లైన్ బార్ కేడింగ్, దుస్తులు మార్చుకొనుటకు డ్రెస్సింగ్ రూమ్ లు, అంతర్గత లింకు రోడ్లు, కెనాలులో సిల్ట్ తొలగింపు తదితర పనులను పూర్తి చేసి భక్తులకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు.
జాతర ప్రారంభానికి పది రోజుల ముందు నుంచే మహిమగల అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తుల తాకిడి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, రేకుర్తి కార్పొరేటర్ మాధవి కృష్ణ, కార్పొరేటర్లు, మాజీ ఎంపిపి వాసాల రమేష్, కరీంనగర్ నగరపాలక సంస్థ డీఈ. మసూద్, సమ్మక్క, సారలమ్మ ఆలయ చైర్మన్ పిట్టల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.