MLC Elections | జనగామ : జనగామ జిల్లాలో వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో వద్ద ఓటర్లు బారులు తీరినట్లు పేర్కొన్నారు. పట్టభద్రులు విధిగా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకుంటున్నారు. దివ్యాంగ పట్టభద్రుల ఓటర్లు కూడా తమ ఓటును సద్వినియోగం చేసుకుంటున్నారు. ఓటర్లలో చైతన్యం పెరిగిందని, ఓటు వేసేందుకు ముందుకు వస్తున్నట్లు పేర్కొన్నారు.