చండీగఢ్: పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ రాబోయే ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోతారని ఆ రాష్ట్రానికి చెందిన శిరోమణి అకాలీదళ్ పార్టీ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ విమర్శించారు. పంజాబ్లో అత్యంత అసహ్యించుకున్న వ్యక్తిపై పోల్ నిర్వహిస్తే ఫలితం అమరీందర్ సింగ్గా వస్తుందని ఎద్దేవా చేశారు. తమ పార్టీనే కాదు.. పంజాబ్ ప్రజలతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. 1996 లో కూడా తాము బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నామని సుఖ్బీర్ సింగ్ బాదల్ తెలిపారు. అయితే దరదృష్టవశాత్తు 25 ఏండ్లు దూరంగా ఉన్నామని అన్నారు. తమ రెండు పార్టీలకు ఒకే భావజాలం ఉందని, తమది 1 + 1= 2 కాదని, అది 11 అవుతుందన్నారు. 1996లో క్లీన్ స్వీప్ను నమోదు చేశామని, రానున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో దానిని పునరావృతం చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.