ఆదిలాబాద్: జిల్లాలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పర్యటన వాయిదా పడింది. వాతావరణం సరిగా లేకపోవడంతో గవర్నర్ పర్యటన వాయిదా పడినట్లు అధికారులు తెలిపారు. కేస్లాపూర్లో సోమవారం జరగనున్న గిరిజన నాయకుడు బిర్సాముండా 146 జయంతి ఉత్సవాల్లో పాల్గొనాల్సి ఉన్నది. అదేవిధంగా నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేయాల్సి ఉన్నది. ఇందుకోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా మబ్బులు కమ్ముకోవడంతోపాటు చినుకులు పడుతుండటంతో గవర్నర్ పర్యటన వాయిదాపడింది.