హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. యోగా ద్వారా ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. శారీరక, మానసిక, రోగ నిరోధకశక్తిని పెంచుకోవడానికి యోగా బాగా ఉపయోగపడుతున్నదని తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగా సాధన చేసి ఆరోగ్యంగా ఉండాలని గవర్నర్ ఆకాంక్షించారు.