జయశంకర్ భూపాలపల్లి : దివ్యాంగుల సంక్షేమానికి(welfare of disabled) ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి (MLA Gandra Venkata Ramana Reddy) అన్నారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి (bupala district)జిల్లా కేంద్రంలోని కృష్ణ కాలనీ సింగరేణి మినీ ఫంక్షన్ హాల్ లో 328 మంది దివ్యాంగులకు ఎలక్ట్రానిక్స్ పరికరాలను అందజేశారు.
మహిళాభివృద్ధి, దివ్యాంగులు, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందించిన రూ. 33 లక్షలతో వీల్ చైర్స్, సహాయ ఉపకరణములు, సోలార్ లైట్లు, బెడ్స్, హెరింగ్ హెడ్స్ జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రాతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ల పంపిణీలో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించి పంపిణీ చేస్తామన్నారు.
అంగవైకల్యం ఉన్న దళితులకు దళిత బంధు(dalitha bandu)లో అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. జిల్లాలో ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు వాహనాలను అందజేసేందుకు తనవంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు. దివ్యాంగుల భవనం రాష్ట్రంలోనే మొదటిసారిగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిర్మించడం గర్వకారణం అన్నారు. జిల్లాలో 7500 మంది దివ్యాంగులకు పెన్షన్లు అందజేస్తున్నామన్నారు.