మంచిర్యాల : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు చెన్నూర్ నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మంత్రి బర్త్డే సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని.. ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే, బాల్క సుమన్ ప్రారంభించారు.
వంద మంది యువకులు రక్తదానం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. లాంగ్ లీవ్ కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్ పాల్గొన్నారు.