కమలాపూర్, అక్టోబర్ 3: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం ఏం పనులు చేసింది.. బీజేపీ చేసిందేమిటో ప్రజలకు వివరంగా తెలియజేయాలని పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సూచించారు. ఆదివారం మండలంలోని మర్రిపెల్లిగూడెంలో టీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 30న ఎన్నికలు జరుగనుండటంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు తెలియజేయాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమ ధ్యేయంగా అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్టు, ఆసరా పెన్షన్లు, దళితబంధు వంటి పథకాల గురించి వివరించాలని సూచించారు.