హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ పేర్కొన్నారు. మునుపెన్నడూ లేనివిధంగా ఉద్యోగుల శ్రేయస్సు కోసం ఒక్క ఏడాదిలోనే జీవోలివ్వడం చరిత్రాత్మకమని చెప్పారు. అఖిల భారత ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఉపాధ్యక్షుడిగా మామిళ్ల రాజేందర్, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా రాయికంటి ప్రతాప్ ఎన్నికైన సందర్భంగా వారిని శుక్రవారం నాంపల్లిలోని టీఎన్జీవోభవన్లో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సమాఖ్య కోశాధికారి రామినేని శ్రీనివాస్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు గజ్జల రాంకిషన్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, శ్యాంసుందర్, కత్తి రమేశ్, కొండల్రెడ్డి, శైలజ, శ్రీహరిరామ్, నరసింహారెడ్డి, సోమయ్య, వేణుగోపాల్, నాగరాజు, శ్రీకాంత్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.