హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (ఈఎస్ఐ) నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం బుధవారం నాచారంలోని ఈఎస్ఐ హాస్పిటల్లో నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ సీహెచ్ శ్రీనివాస్రావు, గౌరవ అధ్యక్షుడిగా డాక్టర్ పీ రమేశ్, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ ఎస్ సతీశ్కుమార్, కోశాధికారిగా డాక్టర్ మధు ప్రమాణం చేశారు.
వైస్ ప్రెసిడెంట్లుగా డాక్టర్ వీ రజ్వంత్, డాక్టర్ బీ ఉత్తమ్కుమార్, డాక్టర్ విజయకుమార్, డాక్టర్ దుర్గాప్రసాద్, కార్య నిర్వాహక కార్యదర్శిగా డాక్టర్ వెంకట్రెడ్డి ఎన్నికయ్యారు. కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ, ఎలక్షన్ కమిటీ అధికారి డాక్టర్ వెంకటేశ్బాబు తదితరులు పాల్గొన్నారు.