హైదరాబాద్: నిధుల సమీకరణ కోసం నిరుపయోగంగా ఉన్న సర్కారు భూముల అమ్మకానికి సంబంధించిన ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా జిల్లాల్లో భూముల విక్రయానికి నోటిఫికేషన్ జారీ చేసింది. మహబూబ్నగర్, నల్లగొండ, రంగారెడ్డి, వికారాబాద్, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, పెద్దపల్లి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో పాట్లను విక్రయించనుంది.
కనిష్టంగా 60 చదరపు గజాల నుంచి గరిష్టంగా 6,500 చదరపు గజాల వరకు ఉన్న ఈ స్థలాలను హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ ద్వారా అమ్మనున్నారు. దీనికోసం మార్చి 14, 15, 16, 17 తేదీల్లో భూముల అమ్మకం వేలం నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా ఈనెల 18, వచ్చేనెల 7వ తేదీల్లో ప్రీబిడ్ సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. చదరపు గజానికి కనీస ధర రూ.5 వేలు ఉండగా, గరిష్టంగా రూ.40 వేలు ఉన్నది.