Derailed | నల్గొండ జిల్లా విష్ణుపురం వద్ద గూడ్స్ రైలు పట్టాలింది. దీంతో సికింద్రాబాద్-గుంటూరు మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నది. ప్రస్తుతం ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. పట్టాలు తప్పిన బోగీలను ట్రాక్పై తెచ్చేందుకు గుంటూరు నుంచి ప్రత్యేక ట్రెయిన్ను అధికారులు తెప్పిస్తున్నారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోలకు అంతరాయం కలుగుతున్నది.
మిర్యాలగూడ రైల్వేస్టేషన్లలో శబరి ఎక్స్ప్రెస్ రైలు మూడు నాలుగు గంటలుగా నిలిచిపోయింది. జన్మభూమి ఎక్స్ప్రెస్ పిడుగురాళ్లలో ఆగిపోయింది. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే దారి మళ్లించింది. మరికొన్ని రైళ్ల సమయాల్లో మార్పులు చేసింది. విజయవాడ-లింగంపల్లి రైలు వేళ్లలో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. గంట ఆలస్యంగా విజయవాడ-లింగంపల్లి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ నడువనున్నది. ఫలక్నుమా, విశాఖ ఎక్స్ప్రెస్ రైళ్లు దారి మళ్లించింది. పగిడిపల్లి, ఖాజీపేట, వరంగల్, కొండపల్లి మీదుగా విజయవాడకు మళ్లించింది.