యాదాద్రి, సెప్టెంబర్ 3: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి వేద ఆశీర్వచనం సాధారణ భక్తులకు సైతం దక్కనున్నది. గతంలో వీవీఐపీలకు మాత్రమే పరిమితమైన ఈ ఆశీర్వచనం ఇకపై భక్తులకు కూడా అందించనున్నారు. ఇందుకోసం రూ.516 టికెట్ ధర నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం ఈవో ఎన్ గీత మొదటి పూజ టికెట్ తీసుకుని స్వామివారి వేద ఆశీర్వచనం స్వీకరించారు.