హైదరాబాద్ సమీపంలో రూ.200 కోట్లతో 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించ తలపెట్టిన శ్రీకృష్ణ మందిరానికి భూమిని కేటాయించాలని ఇస్కాన్ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇస్కాన్ ప్రతినిధులు శుక్రవారం అరణ్యభవన్లో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
సమావేశంలో దేవాదాయశాఖ కమిషనర్ అనిల్కుమార్, డిప్యూటీ కమిషనర్ రామకృష్ణ, ఇస్కాన్ విశాఖ నగరశాఖ అధ్యక్షుడు సాంబదాస్ ప్రభుజీ తదితరులు పాల్గొన్నారు. – హైదరాబాద్