హైదరాబాద్, జనవరి28 (నమస్తే తెలంగాణ): ఇప్పటివరకు అనుమతుల్లేని భారీ, మధ్యతరహా, బహుళార్థ సాధక ప్రాజెక్టుల వివరాలను అందజేయాలని దేశంలోని అన్ని రాష్ర్టాలను కేంద్ర జల్శక్తి శాఖ కోరింది. శనివారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు పంపింది. అనుమతులు పొందని ప్రాజెక్టుల జాబితాను కూడా సిద్ధం చేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నది. రాష్ర్టాలు తమ పరిధిలోని నదులు, అంతర్రాష్ట్ర నదులపై నిర్మించిన, అనుమతులు పొందని ప్రాజెక్టుల జాబితాను అందజేయాలని సూచించింది.