హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఐక్యరాజ్యసమితిలో భారత దౌత్యవేత్తగా పనిచేస్తున్న తెలుగు వ్యక్తి రాజా కార్తికేయకు అమెరికాలోని జార్జిటౌన్ వర్సిటీ నుంచి పురస్కారం దక్కింది. నాయకత్వం, సృజనాత్మకత, విలువలు, సమాజసేవ, మానవ సంబంధాల పరంగా ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు ఎంఎస్ఎఫ్ఎస్ శతాబ్ది ఉత్సవాల కమిటీ ప్రకటించింది.
విశాఖపట్నానికి చెందిన రాజా కార్తికేయ హైదరాబాద్లోని భారతీయ విద్యాభవన్, నిజాం కళాశాలలో విద్యనభ్యసించాడు. ఆ తర్వాత 2007-09లో జార్జిటౌన్ వర్సిటీలో ఎంఎస్ఎఫ్ఎస్ కోర్సు పూర్తి చేశారు. 2011 నుంచి ఐక్యరాజ్యసమితిలో భారత దౌత్యవేత్తగా పనిచేస్తున్నారు.