హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తె లంగాణ): ఆర్టీసీలోని ఉద్యోగ సంఘాల మధ్య అభిప్రాయభేదాలు వెలుగుచూస్తున్నాయి. భేదాభిప్రాయాల నేపథ్యంలోనే ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్క్ర్స్ సంఘానికి చెందిన రాజిరెడ్డిపై ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) ప్రధాన కార్యదర్శి థామస్రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన శనివారం బహిరంగ లేఖ విడుదల చేశారు.
ఆర్టీసీ ఉద్యోగ సమస్యల పరిష్కారం కాకుండా రాజిరెడ్డి అడ్డుపడుతున్నారని ఆ లేఖలో ఆరోపించారు. ఉద్యోగుల సమస్యలు పట్టించుకోకుండా, పరిస్థితులు కూడాఅర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారని అసహనం వ్యక్తం చేశారు. ‘రాజిరెడ్డీ.. నువ్వు ఆర్టీసీలో విలువల్లేని వ్యక్తివి’.. అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.