Gellu Srinivas Yadav | హైదరాబాద్ : తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్( TSTDC ) చైర్మన్గా టీఆర్ఎస్వీ( TRSV ) రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్( Gellu Srinivas Yadav )ను ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) నియమించారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి( CS Shanti Kumari ) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్కు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కరీంనగర్ జిల్లా( Karimnagar Dist ) వీణవంక మండలం హిమ్మత్నగర్ గ్రామంలో లక్ష్మి, మల్లయ్య దంపతులకు గెల్లు శ్రీనివాస్ 1983, ఆగస్టు 21వ తేదీన జన్మించారు. ఎంఏ, ఎల్ఎల్బీ పూర్తి చేశారు. రాజనీతి శాస్త్రంలో పీహెచ్డీ చేశారు. ప్రస్తుతం టీఆర్ఎస్వీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. తండ్రి గెల్లు మల్లయ్య కొండపాక ఎంపీటీసీగా పని చేశారు. తల్లి లక్ష్మి హిమ్మత్నగర్ సర్పంచ్గా సేవలందించారు. ఇక గెల్లు శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ తరపున హుజురాబాద్ నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే.
రాజకీయ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చిన శ్రీనివాసయాదవ్.. డిగ్రీ (బీఏ) చదువుతున్నప్పటినుంచే విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. హైదరాబాద్ అంబర్పేటలోని ప్రభుత్వ బీసీ హాస్టల్లో ఉంటూ.. 2003-2006 మధ్య టీఆర్ఎస్వీ ఏవీ కాలేజీ శాఖకు అధ్యక్షుడిగా ఎన్నికై విద్యార్థుల సమస్యలపై పోరాడారు. విద్యార్థుల ఫీజు పెంపు నిర్ణయానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో శ్రీనివాస్ యాదవ్ కీలకపాత్ర పోషించారు. ఫీజు పెంపును వ్యతిరేకిస్తూ ఏవీ కాలేజీల్లో నడిపిన ఉద్యమంలో శ్రీనివాస్ యాదవ్ అరెస్టు కూడా అయ్యారు. చివరకు కాలేజీ యాజమాన్యం ద్వారా ఫీజు రీయంబర్స్మెంట్ సాధించడంలో ఆయన విజయం సాధించారు. 2003- 2006 మధ్య టీఆర్ఎస్వీ హైదరాబాద్ పట్టణ కార్యదర్శిగా గెల్లు శ్రీనివాసయాదవ్ పనిచేశారు. బొమ్మ రామ్మూర్తి, బాబా ఫసీయుద్దీన్ నాయకత్వంలో ఆయన ఉద్యమాల్లో పాల్గొన్నారు. 2003-2004 విద్యాసంవత్సరంలో బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఇందిరాపార్కులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా శ్రీనివాస్ యాదవ్ ధర్నాలు నిర్వహించారు. 2004 డిసెంబర్లో విద్యార్థుల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేస్తూ అప్పటి ఆర్థికమంత్రి కొణిజేటి రోశయ్య ఇంటిని ముట్టడించారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ అరెస్టు కూడా అయ్యారు. 2006-2007లో హైదరాబాద్లోని తెలుగు యూనివర్సిటీలో టీఆర్ఎస్వీ శాఖకు అధ్యక్షుడిగా పనిచేశారు.
2017 నుంచి టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నారు. ఉస్మానియాలోనూ, బయటా విద్యార్థి పోరాటాలకు గెల్లు శ్రీనివాస్ కొత్త అర్థాన్నిచ్చారు. సమైక్యవాదుల పై నిరసనజెండాను ఎగురవేశారు. 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో చరుగ్గా పాల్గొన్నారు. ఉద్యమంలో ఆయనపై వందకు పైగా పోలీసు కేసులున్నాయి. అనేక పర్యాయాలు అరెస్ట్ అయ్యారు. తెలంగాణ కోసం రెండుసార్లు జైలుకు వెళ్లి.. 36రోజులు చర్లపల్లి, చంచల్గూడ జైళ్లల్లో గడిపారు.