HomeTelanganaGangu Upendra Sharma The Brahmin Association Has Called For The Success Of The Brahmin Sankharava To Be Organized On 23rd Of This Month In Huzurabad Of Karimnagar District
బ్రాహ్మణ శంఖారావాన్ని జయప్రదం చేయండి
కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో ఈ నెల 23న నిర్వహించనున్న బ్రా హ్మణ శంఖారావా న్ని విజయవంతం చేయాలని బ్రాహ్మ ణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ పిలుపునిచ్చారు.
బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ
హుజూరాబాద్టౌన్, జూలై 11: కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో ఈ నెల 23న నిర్వహించనున్న బ్రా హ్మణ శంఖారావాన్ని విజయవంతం చేయాలని బ్రాహ్మ ణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ పిలుపునిచ్చారు. మంగళవారం హుజూరాబాద్లోని రాధాస్వామి సత్సంగ్లో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 14 బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో శంఖారావం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
రాష్ట్రంలోని బ్రాహ్మణులంతా పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. బ్రాహ్మణ సంక్షేమం కోసం రూ.300 కోట్లు ఖర్చు చేసిన తెలంగాణ సర్కారుకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు విష్ణుదాసు గోపాల్రావు, నాయకులు వల్లూరి పవన్, దీపక్బాబు, రంగారావు, కృష్ణమూర్తి, రాహులాచార్యులు, సంపత్కుమారాచార్యులు, నందకుమారాచార్యులు, శ్రీధరాచార్యులు, రామకృష్ణ, భాసర్, తిరుమలేశ్ పాల్గొన్నారు.