వేములవాడ, జూలై 21 : పాస్పోర్టులు, నకిలీ టెన్త్ సర్టిఫికెట్లు తయారు చేసి అందిస్తున్న ముఠాను రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పోలీసులు పట్టుకొన్నారు. వేములవాడ డీఎస్పీ కే నాగేంద్రాచారి గురువారం మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. వేములవాడకు చెందిన పాస్పోర్టు ఏజెంటు పోచంపల్లి దేవరాజు, ఆన్లైన్ కంప్యూటర్ సర్వీసెస్ నిర్వాహకుడు మహమ్మద్ ముజాహిద్ అలియాస్ మహమ్మద్ ముషాహెద్ పాషా కలిసి పాస్పోర్టుల కోసం అవసరమైన నకిలీ పదోతరగతి సర్టిఫికెట్లు సమకూరుస్తామని పలువురిని ఒప్పించారు. ఈ క్రమంలో పదిమంది వద ్దడబ్బులు తీసుకొని నకిలీ టెన్త్ సర్టిఫికెట్లను తయారు చేసి ఇవ్వగా, వీరంతా ఆ సర్టిఫికెట్లను ఉపయోగించి పాస్పోర్టులు పొందారు. నకిలీ టెన్త్ సర్టిఫికెట్లను తయారు చేస్తున్నట్టు స్పెషల్ బ్రాంచ్ ఎస్సై జీ బాలకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పట్టణ సీఐ వెంకటేశ్ నేతృత్వంలో దర్యాప్తు జరిపారు. పాస్పోర్టు ఏజెంటు పోచంపల్లి దేవరాజు, ఆన్లైన్ కంప్యూటర్ నిర్వాహకుడు మహమ్మద్ ముజాహిద్తోపాటు నకిలీ సర్టిఫికెట్ల ఆధారంగా పాస్పోర్టులు పొందిన శాలిబండ్ల జోసఫ్రెడ్డి, మహహ్మద్ బాబూమియా, మహమ్మద్ చాంద్, ఎర్రం దేవేందర్, రెడ్డవేని చంద్రంను గురువారం అరెస్టు చేశారు. వీరి వద్ద నకిలీ పదో తరగతి సర్టిఫికెట్లు, నాలుగు పాస్పోర్టులు, సర్టిఫికెట్ల తయారీకి ఉపయోగించిన ల్యాప్టాప్, కంప్యూటర్, ప్రింటర్, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొన్నారు. మిగితా ఐదుగురు పరారీలో ఉన్నారని డీఎస్పీ నాగేంద్రాచారి తెలిపారు. పాస్పోర్టులు పొంది పరారీలో ఉన్నవారు స్వదేశంలోనే ఉన్నారా? లేక విదేశాలకు వెళ్లారా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతున్నదని వెల్లడించారు. గొండ జిల్లా నాగార్జునసాగర్ హిల్కాలనీలోని బుద్ధవనం ప్రాజెక్టును సందర్శించారు. బుద్ధుడి పాదాలకు పుష్పాంజలి ఘటించారు. బుద్ధవనం ప్రాజెక్టుతో తెలంగాణకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తున్నదని తెలిపారు.