మహవీర్ చక్రతో వందశాతం సంతృప్తి చెందట్లేదు: సంతోష్ తండ్రి

హైదరాబాద్: లడఖ్లోని గాల్వాన్ లోయలో చైనాతో గతేడాది జూన్లో జరిగిన ఘర్షణలో వీరమరణం పాలైన కల్నల్ సంతోష్ బాబుకు మహావీర చక్ర పురస్కారంతో తాను 100 శాతం సంతృప్తి చెందడం లేదని ఆయన తండ్రి బీ ఉపేంద్ర పేర్కొన్నారు. తన తనయుడిని పరమవీర చక్రతో గౌరవించాలని అభిప్రాయ పడ్డారు. ‘నాకు అసంతృప్తి లేదు. కానీ నేను (మహావీరచక్ర అవార్డుతో) వందశాతం సంతృప్తి చెందడం లేదు. మరింత మెరుగ్గా నా కొడుకునే గౌరవించడానికి అవకాశం ఉంది. కానీ ఆయన విధులకు గుర్తింపుగా సంతోష్బాబును అత్యున్నత మిలిటరీ అవార్డు పరమ వీరచక్రతో గౌరవించాలని నా అభిప్రాయం’ అని ఉపేంద్ర పీటీఐకి చెప్పారు.
‘నా కొడుకు చూపిన శౌర్య పరాక్రమాలు సైనిక బలగాల్లో పని చేస్తున్న వారితోపాటు పలువురికి స్ఫూర్తినిచ్చాయి’ అని ఉపేంద్ర వ్యాఖ్యానించారు. గతేడాది జూన్ 15వ తేదీన గల్వాన్ లోయలో చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో 16వ బీహార్ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సంతోష్బాబుతో సహా 20 మంది సైనికులు ముఖాముఖీ పోరాడి అశువులు బాసి అమరులు అయ్యారు. పలు దశాబ్దాలుగా చైనా, భారత్ మధ్య తీవ్రంగా జరిగిన సైనిక ఘర్షణల్లో ఇదొకటిగా నిలిచింది.గల్వాన్లోయలోని వాతావరణ పరిస్థితులతో తలెత్తిన సవాళ్లను అధిగమించి చైనా బలగాలతో తన కొడుకు పోరు సల్పాడని ఉపేంద్ర అభిప్రాయ పడ్డారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- నవభారత నిర్మాణంలో యువత భాగం కావాలి: వెంకయ్య పిలుపు
- వీడియో : జపాన్ కేబినెట్ లో వింత శాఖ
- ‘మూడ్’మారుతోందా!: వచ్చే ఏడు 13.7 శాతం వృద్ధి సాధ్యమేనా?!
- సూరత్లో బీజేపీ కన్నా ఆప్కు ఎక్కువ ఓట్లు
- నూతన ఐటీ నిబంధనలు అమలైతే వాట్సాప్కు చిక్కులే!
- ఇంగ్లాండ్ 81 ఆలౌట్.. భారత్ టార్గెట్ 49
- కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్
- ఎంటర్టైనింగ్గా 'షాదీ ముబారక్' ట్రైలర్
- ఎలక్ట్రిక్ స్కూటర్ నడుపుతూ పడిపోబోయిన సీఎం మమత
- ఘట్కేసర్ ప్లైఒవర్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి