హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): ప్రజాయుద్ధనౌక గద్దర్ పేరును వాడుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025 పేరిట కోట్లు కుమ్మరించడం ఏమిటని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. గాయని శ్రేయా ఘోషల్కు రూ.1.65 కోట్లు, దేవిశ్రీ ప్రసాద్కు రూ.80 లక్షలు ఖర్చు చేయడం ఏమిటని మంగళవారం ఎక్స్ వేదికగా నిలదీశారు. నిధి అగర్వాల్కు రూ.20 లక్షలు, యాంకర్లు సుమ-ప్రదీప్కు రూ.13 లక్షలు ఇలా ఆర్టిస్టుల కోసమే రూ.4.11 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. ఒకరాత్రి ఈవెంట్కు వ చ్చినవారి ప్రయాణాలు, బసకు రూ.60 ల క్షల ప్రజాధనం వెచ్చించారని విమర్శించారు.
గద్దర్ఫిల్మ్ అవార్డ్స్-2025 ఖర్చుల వెనుక పెద్ద మాయాజాలమే జరిగిందని శ్రవణ్ ఆరోపించారు. టెండర్ కాస్ట్ కాలమ్లో రూ.2.13 కోట్లు ఉంటే, తుది బిల్లు రూ.4.11 కోట్లు వేశారని, అంటే రూ.2 కోట్ల అదనపు ఖర్చు ఎవరి జేబుల్లోకి వెళ్లిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు, రైతు భరోసాకు పైసల్లేవని ఏడ్చే ప్రభుత్వం.. ఒకరాత్రి వేడుకకు ఇన్ని కోట్లు ఎలా వెచ్చిస్తుంది? అని నిలదీశారు. దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.