హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. బయటకు వెళ్లిన వారు భానుడి ప్రతాపానికి బెంబేలెత్తిపోతున్నారు. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. వచ్చే మూడురోజుల్లో ఎండల తీవ్రత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. సోమవారం నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో 45.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని వెల్లడించారు. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్లో 45.3 డిగ్రీలు, కామారెడ్డి జిల్లా బాన్సువాడలో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని పేర్కొన్నది.
ఈ నేపథ్యంలో వచ్చే మూడురోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉన్నదని తెలిపింది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాలులు వీస్తాయని వివరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్నం 12 గంటల నుంచి 3వరకు అత్యవసర సమయాల్లో బయటకు వెళ్లాలని సూచించింది.