నల్లగొండ : రోడ్డుప్రమాదంలో చనిపోయిన ఓ కొండెంగకు హిందూ సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన మాడ్గులపల్లి మండలం చింతలగూడెంలో చోటు చేసుకుంది. ఓ కొండెంగ రోడ్డుప్రమాదంలో మరణించింది. దీంతో ఆ కొండెంగకు గ్రామస్తులు మనషులకు నిర్వహించినట్లే అంత్యక్రియలు చేశారు.
హనుమంతుడి అవతారమైన కోతులు ప్రాణాలు కోల్పోతే పూడ్చి పెట్టాలని సర్పంచ్ గోవింద రెడ్డి పేర్కొన్నారు. ఒక వేళ కొండెంగకు అంత్యక్రియలు నిర్వహించకపోతే గ్రామానికి అరిష్టం ఏర్పడుతుందని భావించినట్లు ఆయన చెప్పారు. నెల రోజుల క్రితంలో కూడా మూడు కొండెంగలు చనిపోగా, వాటికి కూడా అంత్యక్రియలు నిర్వహించారు.