హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ) : ఫార్మసీ కోర్సులకు తీవ్ర డిమాండ్ నెలకొన్నది. ఈ ఏడాది ఎంసెట్ (బైపీసీ) మొదటి విడత కౌన్సెలింగ్లో ఫార్మసీ కోర్సుల సీట్లన్నీ నిండిపోయాయి. బీ ఫార్మసీ కోర్సులో 97.99శాతం సీట్లు భర్తీ కాగా, బయో మెడికల్ ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ కోర్సుల్లో 100శాతం సీట్లు నిండాయి. ఫార్మసీ, ఫార్మా -డీ కోర్సు ల్లో సీట్ల భర్తీకి నిర్వహించిన ఎంసెట్ (బైపీసీ) సీట్లను మంగళవారం కేటాయించారు.
ఎంసెట్ (బైపీసీ)లో 71,166 మంది విద్యార్థులు క్వాలిఫై కాగా, 18,522 మంది విద్యార్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరయ్యారు. మొత్తం 9,062 సీట్లకుగాను తొలివిడతలో 8,909 సీట్లు భర్తీ అయ్యాయి. 153 సీట్లే ఖాళీగా ఉన్నాయి. 5 వర్సిటీలు, 72 ప్రైవేట్ కాలేజీలు సహా 77 కాలేజీల్లో వందశాతం సీట్లు నిండాయి. ఫార్మా -డీలో 60 కాలేజీల్లో ఉన్న 1,312 సీట్లన్నీ భర్తీ అయ్యాయి. ఈడబ్ల్యూఎస్ కోటాలో 617 మంది సీట్లు దక్కించుకొన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 13లోపు ఆయా కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్ట్చేయాలని అధికారులు సూచించారు.