వికారాబాద్, ఫిబ్రవరి 10: మనిషి తలచుకుంటే సాధించలేనిదేమీ ఉండదు. ఇందుకు వికారాబాద్ జిల్లా కరీంపూర్ యూపీఎస్ హెడ్మాస్టర్ ఆంజనేయులు జీవితమే ఉదాహరణ. కోట్పల్లి మండలం బీరెల్లికి చెందిన అనంతమ్మ, నర్సింహులు దంపతు ల కుమారుడు ఆంజనేయులు. బీరెల్లి బడిలో నాలు గోతరగతి వరకు చదివి కుటుంబ పరిస్థితుల కారణంగా మధ్యలోనే ఆపేశారు. పశువుల కాపరిగా మా రారు. వ్యవసాయంలో తల్లిదండ్రులకు ఆసరయ్యా రు. చదువుకోవాలన్న కోరికను మాత్రం చంపుకోలేకపోయారు. 1995లో మామిడిపుడి వెంకటరంగయ్య ఫౌండేషన్ (ఎంవీఎఫ్) క్యాంపులో నేరుగా ఏడోతరగతి పరీక్ష రాసి పాసయ్యారు. టెన్త్ పరిగిలో ని నంబర్ 1 స్కూల్లో చదివారు. ప్రభుత్వ గురుకుల జూనియర్ కాలేజీలో ఇంటర్, వికారాబాద్లోని ఎస్ఏపీ కళాశాలలో డిగ్రీ చేశారు. చదువుకుంటూనే ప్రైవేటుగా పనిచేస్తూ కుటుంబానికి పెద్ద కొడుకుగా బాధ్యతలూ మోశారు. ఓయూ నుంచి బీఈడీ పట్టా పొందారు. 2008లో డీఎస్సీ రాసి టీచర్ ఉద్యోగం సాధించారు. కోట్పల్లి మండలం కొత్తపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరారు. ఆరేండ్లు అ క్కడ పనిచేసి కోట్పల్లి మండలం కరీంపూర్ యూపీఎస్కు వచ్చారు. ఇప్పుడు హెచ్ఎంగా కొనసాగుతూ పలువురికి ఆదర్శంగా నిలిచారు ఆంజనేయులు.