హైదరాబాద్: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్పై భారత్లోని ఫ్రెంచ్ అంబాసిడర్ ఇమ్మాన్యుయేల్ లినైన్ ప్రశంసలు కురిపించారు. దేశంలోనే అత్యంత చురుకైన బిజినెస్ మంత్రి కేటీఆర్ అని ఎమ్మాన్యువల్ కొనియాడారు. ఫ్రెంచ్ బిజినెస్ మిషన్కు చెందిన ప్రతినిధులతో గురువారం హైదరాబాద్లో సమావేశం జరిగింది.
ఫ్రాన్స్ నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి హాజరైన ఫ్రాన్స్ అంబాసిడర్ ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ తెలంగాణకు రావడం సంతోషంగా ఉందన్నారు. భారత్లోనే ప్రో బిజినెస్ మంత్రిగా కేటీఆర్ దూసుకువెళ్తున్నారని, ఆయన్ను మరోసారి కలుసుకోవడం ఆనందంగా ఉందని ఇమ్మాన్యుయేల్ అన్నారు. మంత్రి కేటీఆర్ ఎన్నో మంచి విషయాలను చెబుతారని, చెప్పడమే కాదు, ఆయన తన మాటల్ని నిజం చేస్తారని కూడా అన్నారు.
మాటల్ని నిజం చేయడమనేది వ్యాపారంలో కీలకమైన అంశమని ఆయన తెలిపారు. ఎమ్మాన్యువల్ మాట్లాడిన వీడియోను తెలంగాణ డిజిటల్ మీడియా డైరక్టర్ కొణతం దిలీప్ తన ట్విట్టర్లో ఇవాళ పోస్టు చేశారు. అయితే ఆ పోస్టును మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. అంబాసిడర్ లినైన్కు థ్యాంక్స్ తెలిపారు. మెర్సి బియకూప్ అని ఫ్రెంచ్ భాషలోనూ థ్యాంక్స్ చెబుతూ ఎమోజీని కేటీఆర్ పోస్టు చేశారు.
Many thanks for your very kind words Ambassador Lenain @FranceinIndia
Merci beaucoup 🙏 https://t.co/U5zZDXunA4
— KTR (@KTRTRS) September 30, 2022