హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): గ్రూప్-2 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం కృష్ణప్రదీప్ 21 సెంచరీ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ త్వరలో ఆన్లైన్ కోచింగ్ ప్రారంభించనున్నది. దీనికి నమస్తే తెలంగాణ మీడియా భాగస్వామిగా వ్యవహరిస్తున్నది. యాప్లో శిక్షణ ఇస్తారు. అభ్యర్థులు తమకు వీలున్న సమయంలో నిపుణులు రూపొందించిన వీడియో క్లాసులు యాప్ ద్వారా వినవచ్చు. ఈ యాప్లో గ్రూప్-2 స్టడీ మెటీరియల్, అసైన్మెంట్లు, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు, టెస్టులు ఉంటాయి. ఈ యాప్ ద్వారా వీడియో క్లాసులు, అసైన్మెంట్లు, మెంటార్షిప్, టెస్టులు నిర్వహిస్తారు. దీనికి సంబంధించి ఉచిత అవగాహన వెబినార్ ఈ నెల ఏప్రిల్ 4న జరుగనున్నది. ఈ వెబినార్లో సంస్థ చైర్మన్ కృష్ణప్రదీప్, సీనియర్ ఫ్యాకల్టీలు పాల్గొని గ్రూప్-2 విశ్లేషణ, ప్రిపరేషన్ ప్లాన్పై వివరిస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి వివరాలకు 9133637733 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు.
Join Zoom Meeting:
Meeting:https://us02web.zoom.us/j/ 85416314809?pwd=cEpPTFhUZW5rKzRhdmVpOFhlSFNKUT09
Meeting ID: 854 1631 4809,
Passcode: 934905.
Time: Apr 4, 2021 10:00 AM